అనుమానానికి మద్యం తోడయి.. భార్య గొంతు కోసి..!

by  |
అనుమానానికి మద్యం తోడయి.. భార్య గొంతు కోసి..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని ఐదవ టౌన్ పరిధి నాగారంలో భార్యను కిరాతకంగా హత్య చేశాడో భర్త. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నాగారం 80 క్వార్టర్స్ కాలనీకి చెందిన షేహనాజ్ బేగం(30)ను భర్త షేక్ సల్మాన్ కత్తితో గొంతు కోసి హత్యచేశాడు. షహనాజ్ బేగానికి సల్మాన్‌తో 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇటీవల భార్యపై సల్మాన్ అనుమానం పెంచుకున్నాడు.

దీంతో రెండు నెలల కిందట షహనాజ్ పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇరువురు కుటుంబ సభ్యులు సముదాయించడంతో ఆమె అత్తింటికి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సల్మాన్ కత్తితో భార్య గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు షేక్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు రూరల్ సౌత్ సీఐ గురునాథ్ తెలిపారు.

Next Story

Most Viewed