పిల్లలున్నా ప్రియుడే కావాలన్న భార్య.. భర్తకు కోపమొచ్చి..

by  |
Raipur
X

దిశ, వెబ్ డెస్క్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడిని భర్త కత్తితో పొడిచి చంపిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లో నివాసముండే ఓ వ్యక్తికి వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, అతని భార్యకు ఢిల్లీకి చెందిన మరో వ్యక్తితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన భర్త పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లగానే ప్రియుడితో ఫోన్ లో మాట్లాడేది. అంతేకాకుండా అర్ధరాత్రి సమయాల్లో కూడా అతనితో మాట్లాడేది. ఆ విషయం భర్త కంట పడింది. దీంతో అతను భార్యను నిలదీశాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య ప్రతిరోజూ గొడవ అయ్యేది. దీంతో అతడిని, పిల్లలను వదిలేసి ఢిల్లీకి వెళ్లింది. అక్కడికి వెళ్లి ప్రియుడితో కొద్దిరోజులపాటు కలిసి ఉంది. ఆ తర్వాత తిరిగి తన భర్త వద్దకు వచ్చింది. అయినా కూడా ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రియుడు ఆమె కోసం ఢిల్లీ నుంచి జైపూర్ వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో తానొచ్చి బస్టాండ్ సమీపంలో ఉన్నానని ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఆమె ఆ సమయంలో ఇంటి నుంచి బస్టాండ్ వద్దకు వచ్చి అతడిని కలిసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త అక్కడికి చేరుకుని ప్రియుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అక్కడి నుంచి భార్య పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భర్తను అరెస్ట్ చేశారు. అనంతరం ప్రియుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed