ఇప్పటి వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..?

by  |
polling
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి నేటి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. రెండు ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాగా, ఉదయం 9 గంటలకు వరకు సాగర్‌లో 13 శాతం, తిరుపతిలో 8 శాతం ఓటింగ్ పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.


Next Story