- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అరేబియా సముద్రంలో తౌక్తే తుఫాన్ ఏర్పడగా.. ప్రస్తుతం కేరళ తీరానికి సమీపంలో ఇది ఉంది. ఈ నెల 18న గుజరాత్ తీరాన్ని తాకనుండగా.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. అయితే ఈ తుఫాన్కు పేరు పెట్టే అవకాశం ఈసారి మయన్మార్కు దక్కింది. మయన్మార్ వాతావరణ విభాగం బల్లి పేరును ఈ తుఫాన్కి పెట్టింది.
బర్మా భాషలో తౌక్తే అంటే అధికంగా ధ్వనులు చేసే బల్లి అని అర్థం. కాగా ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టే అవకాశం వంతుల వారీగా దేశాలకు దక్కుతాయనే విషయం తెలిసిందే.
Next Story