ఇవి ఎక్కువగా తింటే ముప్పు అంటున్న నిపుణులు

by  |
junk food eating
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు కరోనా మహమ్మరి, మరో వైపు వర్షాకంల మొదలైంది. దీంతో సీజనల్ వ్యాధులు కూడా వ్యాప్తికి అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే పని మాని తగ్గించుకునే ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడండి. లేకుంటే మీ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడడం తప్పదంటున్నారు నిపుణులు.

1. ప్రతీరోజూ మీరు సేవించే కాఫీలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే అది అరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగా షుగర్ వాడడం వల్ల CRP, IL-6 వంటి తాపజనక ప్రోటీన్లు వృద్ధి చెంది రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

2. ఉప్పు అధికంగా వాడడం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. బేకరి ఐటమ్స్, చిప్స్, డిసర్ట్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. మీ తినే రోజు వారి ఆహారంలో ఉప్పు కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

3. ఫ్రైడ్ పుడ్స్, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది కాదంట. మసాలా పదార్థాలు రోగ నిరోధక శక్తి పనితీరుపై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

4. మద్యంపానం వల్ల ఆరోగ్యం క్షీణించి మీరు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగానే ఉందని చాలా అధ్యాయనాల్లో వెల్లడైంది. పరిమితికి మించి మద్యం సేవించడం మీ ప్రాణానికే ముప్పు అంటున్నారు వైద్యులు


Next Story

Most Viewed