రూ.6 వేల కోట్ల భూ దందా ఏంటీ.? వైరల్ అవుతున్న వామన్ రావు పోస్ట్

by  |
రూ.6 వేల కోట్ల భూ దందా ఏంటీ.? వైరల్ అవుతున్న వామన్ రావు పోస్ట్
X

దిశ ప్రతినిది, కరీంనగర్: గట్టు వామన్ రావు హత్య కేసు సంచలనంగా మారడంతో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే వామన్ రావు దంపతుల ఆడియో రికార్డ్ లు వైరల్ మారి సంచలనం సృష్టించాయి. తాజాగా మరో అంశం తెరపైకి రావడంతో వామన్ రావు హత్యపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో వామన్ రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వామన్ రావు అందులో ఏం పేర్కొన్నాడో తెలుసా..?

‘‘ మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలోని 18 గ్రామాల్లో 1973 సీలింగ్ యాక్ట్ ప్రకారం పట్టాలు కలిగి ఉన్న లబ్ధిదారుల పేర్ల నుండి వేరే ఇతర వ్యక్తుల పేర్లపైకి అక్రమ మార్గంలో సుమారు 1200 ఎకరాలు, ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 6 వేల కోట్ల విలువైన భూమిని బదలాయించి చట్ట విరుద్దంగా సీలింగ్ పట్టా మార్పిడి చేసిన అవినీతి అధికారులపై చర్యల కోసం హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలు చేయనున్న నెన్నెల మండలం ఇందూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఇందూరి రాంమోహన్’’ అన్న పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగినట్టుగా తెలుస్తున్న ఈ పోస్టుకు సంబంధించిన వారు ఎవరైనా ఈ మర్డర్ ప్లాన్ లో ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.6 వేల కోట్ల విలువైన భూ దందా స్కాం గురించి వెలుగులోకి వస్తే పెద్ద తలకాయలు బయటపడతాయన్న ఆందోళనతో చేతులు కలిపి ఉంటారా అన్న చర్చ ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతోంది.



Next Story

Most Viewed