సరదా కోసం వెళ్ళి వాగులో ఇద్దరు గల్లంతు..

by  |
lost in river
X

దిశ, సిద్దిపేట: సరదా కోసం వెళ్లిన ఇద్దరు యువకులు వాగులో దిగి గల్లంతైన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గోనెపల్లి వాగులో ఇద్దరు వ్యక్తులు సరదాగా ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే మధ్య ప్రదేశ్, ముంబయికి చెందిన సురేష్ సింగ్, జై సింగ్ లు మరి కొందరితో గోనెపల్లి వాగు వద్దకు వెళ్లారు. జై సింగ్ సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగాడు.

వరద ఉధృతికి అతడు నీళ్లలో కొట్టుకుపోతుండడంతో, అతన్ని కాపాడడానికి నీళ్లలోకి దిగిన సురేష్ సింగ్ సైతం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వీరిని కాపాడే ప్రయత్నం చేసి వాగులో చిక్కుకున్న మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. వాగులో గల్లంతైన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, గల్లంతు అయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గల్లంతు అయిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ వాగుపై దాదాపు 20 చోట్ల చెక్ డ్యామ్ లు ఉండడంతో అన్ని చెక్ డ్యామ్ ల వద్ద చేపలు పట్టేవారిని అప్రమత్తం చేశారు.



Next Story