500కిలోల గంజాయి పట్టివేత..

by  |
500కిలోల గంజాయి పట్టివేత..
X

దిశ, విశాఖపట్నం : విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి వద్ద రూ.20 లక్షల విలువ చేసే గంజాయిని అటవీ అధికారులు సొమవారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో లంబసింగి అటవీ చెక్​పోస్టు వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని మల్కాన్​గిరి నుంచి విశాఖకు చిలగడ దుంపల లోడుతో వెళ్తున్న లారీని తనిఖీ చేయగా.. దుంపలు, అరటి గెలల కింద గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

లారీలో సుమారు 500 కిలోల గంజాయి ఉన్నట్లు తేలింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా అతడు పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న గంజాయిని టాస్క్​ఫోర్స్ పోలీసులకు అప్పగించనున్నట్లు అటవీ సెక్షన్ అధికారి అప్పారావు తెలిపారు.

Next Story

Most Viewed