డెయిరీ బలోపేతానికి కృషి చేస్తాం: డెయిరీ ఉద్యోగుల సంఘం

by  |
vijaya dairy
X

దిశ, తెలంగాణ బ్యూరో: విజయ డెయిరీ బలోపేతానికి కృషి చేస్తామని, అభివృద్ధికి సహకరిస్తామని సంస్థలో పనిచేస్తున్న బీసీ, మైనారిటీ, ఓసీ ఉద్యోగులు తెలిపారు. బీసీ, మైనార్టీ, ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని స్థాపించుకున్నామని సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సుధాకర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తూనే న్యాయబద్ధంగా తమకు చెందాల్సిన హక్కుల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సంఘం మొదటి సమావేశంలో డెయిరీలో పనిచేస్తున్న బీసీ, ఓసీ, మైనారిటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం కార్యదర్శిగా ప్రవీణ్, ట్రెజరర్‌‌గా రమేశ్‌ గౌరి ఎన్నికయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed