- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ కొందరు ప్రజలను భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కొంతమంది వాలంటీర్లు వైసీపీకి ఓట్లు వేయకుంటే ప్రభుత్వ పథకాలు రావని ప్రజలను బెదిరిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పథకాలు రావని ఎవరైనా వైసీపీ నేతలు కానీ, వాలంటీర్లు కానీ బెదిరింపులకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. సమాచారం అందించడానికి అతను ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ 7557557744 నెంబర్ ను ప్రకటించారు. ఈ నెంబర్ కు కాల్ రికార్డు కానీ, ఫోటో కానీ వాట్సాప్ చేస్తే ఆ వ్యక్తులకు అకౌంట్ లో రూ.10 వేలు వేస్తామని చెప్పారు. అలాగే లోక్ సభ పరిధిలోని ఏడు నియోజక వర్గాలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. పథకాలు పోతాయి అనే భయం వదిలేసి ఓటర్లంతా టీడీపీ పక్షాన నిలవాలి పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీని గెలిపిస్తే వైసీపీకి బుద్ధి చెప్పినట్టుగా అవుతుందన్నారు.