- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
బెంగళూరు: ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చే పనిని వేగవంతం చేసినట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వంత్ నారాయన్ గురువారం తెలిపారు. రాష్ట్రంలో గోవధను కూడా నిషేధించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలో కాలేజ్ నుంచి బయట వస్తున్న యువతిని ఓ యువకుడు కాల్చి చంపాడు. అప్పటినుంచి లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటించాయి.
వివాహం కోసం మత మార్పిడిని నిషేధిస్తూ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి చట్టమే తీసుకురానున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో లవ్ జిహాద్, గోవధను నిషేధిస్తూ చట్టాలను తీసుకురానున్నట్లు కర్ణాటక రాష్ట్రం ప్రకటించడం గమనార్హం.
Next Story