- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: ఇటీవల దుబ్బాకలో ఇంటి పైకప్పు కూలీ మృతి చెందిన వార్తా విలేకరి మల్లికార్జున్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. దుబ్బాకలో మల్లికార్జున్ తల్లి, భార్యా, పిల్లలను ఆయన పరామర్శించి ఓదార్చారు. ప్రమాదాల్లో మృతిచెందే జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయాన్ని మల్లికార్జున్ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి రూ.1,50,000 ఆర్థిక సహకారాన్ని అందించారని, అలాగే మృతుని భార్యకు ఉపాధి, డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని విరాహత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజే జర్నలిస్టుల ఆరోగ్య సేవల కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఏ.రాజేష్, యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అంబటి వెంకట్, సీనియర్ నాయకులు శివ కుమార్, కాల్వ లింగం, దుబ్బాక ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.