కాళేశ్వరం అవినీతితో మాకు సంబంధం లేదు

by  |
కాళేశ్వరం అవినీతితో మాకు సంబంధం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందో లేదో పరిశీలించడం తమ బాధ్యత కాదని, ఆ ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత ఆర్థిక వనరుల నుంచి కట్టుకున్నందున ఆ అవినీతితో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టు ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని, దాని ప్రాధాన్యత కూడా ఆ ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తూడు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కేవలం సాంకేతిక సహకారం, కొన్ని అంశాల్లో మాత్రమే ఆర్థిక మద్దతు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల విషయంలో అమలు చేస్తున్న నిబంధనలనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ అవలంబించిందని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ అదే వైఖరి అనుసరించామని తెలిపారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగినట్లు తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని వివరించారు. మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం పై విధంగా బదులిచ్చారు.



Next Story