ఆయనను ఎస్ఈసీగా గుర్తించం: కొడాలి నాని

by  |
ఆయనను ఎస్ఈసీగా గుర్తించం: కొడాలి నాని
X

దిశ,వెబ్ డెస్క్: స్థానిక ఎన్నికలపై గవర్నర్‌కు లేఖ రాసిన నిమ్మగడ్డ రమేశ్ ఎవరని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించే హక్కు లేదని మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. గవర్నర్‌కు సలహాలిచ్చే స్థాయి నిమ్మగడ్డకు లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్‌ను లెక్క చేయని నిమ్మగడ్డను ఎస్ఈసీగా తాము గుర్తించమని తెలిపారు. చంద్రబాబు బినామీ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామంటే ఒప్పుకోబోమని చెప్పారు.


Next Story

Most Viewed