స్వేచ్ఛగా ఆడటమే మా లక్ష్యం : శ్రేయస్

by  |
స్వేచ్ఛగా ఆడటమే మా లక్ష్యం : శ్రేయస్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఐపీఎల్ 2020లో సోమవారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్ల ప్రదర్శనకు హాట్సాఫ్… ఒత్తిడిని చిత్తు చేస్తూ… ఎంతో పరిణితి కనబరుస్తున్నారు. ఏ మాత్రం భయం లేకుండా స్వేచ్చగా ఆడటమే మా లక్ష్యం. మా జట్టులో మంచి యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. అందుకే మేము గెలుస్తున్నాము.’ అని అయ్యర్ అన్నారు.


Next Story