ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దం: ఈటల

by  |
ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దం: ఈటల
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా పీక్ స్టేజ్‌కు వెళ్లి తగ్గిపోయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బ్రిటన్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. ప్రయాణీకులకు పాజిటివ్ వస్తే క్వారంటైన్‌కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ గురించి భయపడాల్సిన పనిలేదని వెల్లడించారు. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story

Most Viewed