ఆ విరాళాలకు మాకు సంబంధం లేదు.

by  |
ఆ విరాళాలకు మాకు సంబంధం లేదు.
X

దిశ, వెడ్ డెస్క్: టీఎన్‌జీవో, టీజీవో సంఘాలు ప్రకటించిన విరాళాలకు తమకు ఎలాంటి సంబంధం లేదనీ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్( టీపీటీఎఫ్) తెలిపింది. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీగా ఏర్పడి పోరాడాల్సి ఉండగా, సంఘాలను కలవకుండా, ఇతర సంఘాలకు సంబంధించి కూడా తామే విరాళం ఇస్తున్నట్టు ఎన్‌జీవో సంఘాలు ప్రకటించుకోవడం శోచనీయం అని తెలిపింది. ఇకనైనా లేని పెత్తనాన్ని నెత్తిన ఎత్తుకోవడం మానుకోవాలని టీపీటీఎఫ్ సూచించింది. కాగా హైదరాబాద్ వరదలకు సంబంధించి విరాళంగా ఒక రోజు మూల వేతనం 33 కోట్లు ఇస్తున్నట్టుగా ఉద్యోగులు ఉపాధ్యాయుల తరఫున టీఎన్జీవో, టీజీవో సంఘాలు ప్రభుత్వానికి ప్రాతినిద్యాన్ని అందజేసిన సంగతి తెలిసిందే…వారంలో ఒక్కరోజు ఆఫీసుకు రండి : HCL


Next Story