కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహిస్తున్నాం: మంత్రి సురేశ్

by  |
కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహిస్తున్నాం: మంత్రి సురేశ్
X

దిశ,వెబ్ డెస్క్: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మంత్రి సురేశ్ అన్నారు. టీచర్లను రోడ్డున పడేశామని టీడీపీ నేతలు లేని పోని ఆరోపణలు చేయడం మాను కోవాలని ఆయన సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని కేటగిరీల్లో బదిలీలకు 48, 897 ఖాళీలను గుర్తించామని తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ లో సర్వర్ల సమస్యను దృష్టిలో పెట్టుకుని రేపటి వరకు ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చామని చెప్పారు. బదిలీల ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో చర్చించామని వెల్లడించారు.

Next Story

Most Viewed