- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, గీసుగొండ: ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసేనని ఈస్ట్ జోన్ డిసీపీ వెంకటలక్ష్మి అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశానుసార౦ మంగళవారం గీసుకొండ మండలంలోని ధర్మారం గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకుండా ఉల్లంఘనలకు పాల్పడిన వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ కొనుగోలు చేసిన తరువాత జరిమానా విధించి వెహికిల్స్ విడుదల చేస్తామన్నారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని అది వారికి ప్రాణదాతగా నిలుస్తుందని డీసీపీ హితవు పలికారు.
మద్యం సేవించి సెల్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, ఆర్టీఏ వారి సూచనలకు విరుద్దంగా ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదన్నారు. రూల్స్ పాటించకపోయినట్లయితే ప్రజలే సెల్ ఫోన్లో రికార్డు చేసి పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపిస్తే ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చలానా విధిస్తామని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ నరేష్ కుమార్, గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ దేవేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.