- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కర్నూలు జిల్లా దేవరగట్టులో యుద్ద వాతావరణం నెలకొంది. కరోనా వ్యాప్తి కారణంగా కర్రల సమరాన్ని అధికారులు రద్దు చేసినప్పటికీ.. బన్నీ ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి జైత్రయాత్రలో కర్రలు, అగ్గిదివిటీలతో కొట్టుకున్నారు. కర్రల సమరంలో 40 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించారు.
కరోనా కట్టడిలో భాగంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలను అధికారులు రద్దు చేశారు. అయినప్పటికీ అక్కడ నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేవరగట్టులో భక్తుల రాక దృష్ట్యా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story