కరోనా పరీక్షలకు నిరీక్షణ

by  |
కరోనా పరీక్షలకు నిరీక్షణ
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో కరోనా భయం వణుకు పుట్టిస్తోంది. రోజురోజూకు కరోనా వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోపాటు వచ్చి ర్యాపిడ్ పరీక్షలు వద్ద క్యూ కడుతూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అయితే, ర్యాపిడ్ పరీక్షా కేంద్రంలో నమూనాలు సేకరించేవారు ఒక్కరే ఉండటంతో ఆసల్యమవుతుందని వారు వాపోతున్నారు. ప్రతి రోజు 200 నుంచి 300 మంది వరకు వస్తున్నట్లు వారు తెలిపారు.



Next Story