- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఖమ్మం రూరల్ : కరోనా రక్కసి కారణంగా మరో రెవెన్యూ అధికారి ప్రాణాలు కోల్పోయారు. వేంసుర్మండలం బీరపల్లి గ్రామానికి చెందిన చావా లక్ష్మణ్రావు(49) రూరల్మండలం గోళ్లపాడు గ్రామానికి VROగా పనిచేస్తున్నాడు. గత వారం రోజుల కిందట ఆయన కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లక్ష్మణ్రావు మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆర్థిక సాయం..
వీఆర్వో లక్ష్మణ్రావు లేనిలోటు తీర్చలేనిదని ఆయన కుటుంబానికి సంఘం తరుపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, రూరల్ తహసీల్దార్కారు మంచి శ్రీనివాసరావు తెలిపారు. కుటంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ఆర్ఐ ప్రవీణ్చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రూరల్ తహసీల్దార్కార్యాలయంలో మౌనం పాటించి నివాళ్లు అర్పించారు.