అనారోగ్యంతో కన్నుమూసిన ములుగు వీఆర్ఏ..

by  |
అనారోగ్యంతో కన్నుమూసిన ములుగు వీఆర్ఏ..
X

దిశ, ములుగు : ములుగు పట్టణానికి చెందిన వీఆర్ఏ నూనె నాగేశ్వరరావు( 36) అనారోగ్యం బారిన పడి హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మార్వో మధురకవి సత్యనారాయణ, ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజాల భిక్షపతి గౌడ్ మృతుని ఇంటిని సందర్శించి నాగేశ్వరరావు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. నాగేశ్వరరావు వీఆర్ఏ క్రమశిక్షణగా విధులు నిర్వహించే వారని పేర్కొన్నారు.

మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా దహన సంస్కారాల నిమిత్తం ప్రభుత్వం తరఫున రూ. 20 వేలు, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది రూ. 30 వేలు, ఎమ్మార్వో, వీఆర్వోల యూనియన్, వీఆర్ఏల యూనియన్ తరపున ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం జిల్లా నాయకులు సూరన్న, వీఆర్ఏ సంఘం నాయకులు మాడ రవి, శంకర్, సాంబయ్య, మహేష్, కళాకారుడు రేలా విజయ్, మాలమహానాడు సంఘం రాష్ట్ర నాయకులు దండు శంకర్‌లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed