- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పరిగి : రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో శనివారం నుంచి స్వచ్చందంగా లాక్డౌన్ ప్రకటించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచనల మేరకు పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్, పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్, కమిషనర్, కౌన్సిలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందున స్వచ్చందంగా లాక్డౌన్విధిస్తున్నట్టు తెలిపారు.
శనివారం(8వ తేదీ) నుంచి 16వ తేదీ ఆదివారం వరకు లాక్డౌన్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణ సముదాయాలు తెరిచి కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అంటే రోజులో 19 గంటలు విధిగా లాక్డౌన్ పాటించాలని సూచించారు. పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. నిత్యావసర సరుకులు ఆ 5 గంటల వ్యవిధిలోపే తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షాపింగ్ చేయాలని తెలియజేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప, ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించారు.