పరిగిలో లాక్‌డౌన్.. ‘19 గంటలు’ అన్ని బంద్

by  |
పరిగిలో లాక్‌డౌన్.. ‘19 గంటలు’ అన్ని బంద్
X

దిశ, పరిగి : రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో శనివారం నుంచి స్వచ్చందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచనల మేరకు పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్, పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్, కమిషనర్, కౌన్సిలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందున స్వచ్చందంగా లాక్‌డౌన్​విధిస్తున్నట్టు తెలిపారు.

శనివారం(8వ తేదీ) నుంచి 16వ తేదీ ఆదివారం వరకు లాక్‌డౌన్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణ సముదాయాలు తెరిచి కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అంటే రోజులో 19 గంటలు విధిగా లాక్‌డౌన్ ​పాటించాలని సూచించారు. పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. నిత్యావసర సరుకులు ఆ 5 గంటల వ్యవిధిలోపే తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షాపింగ్ చేయాలని తెలియజేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప, ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed