వొడాఫోన్ యూజర్లకు ఎక్స్‌ట్రా డేటా ఆఫర్స్

by  |
వొడాఫోన్ యూజర్లకు ఎక్స్‌ట్రా డేటా ఆఫర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. తాజాగా డబుల్ డేటాతో కూడిన సరికొత్త ప్లాన్ వివరాలను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది వొడాఫోన్. లాక్‌డౌన్ కారణంగా డేటా యూసేజ్ ఎక్కువగా ఉండటంతో.. యూజర్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, మే చివరి వారంలో వొడాఫోన్ తమ యూజర్లకు అదనపు డేటా ఆఫర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరోసారి యూజర్ల కోసం సరికొత్త డేటా ప్లాన్లను అందిస్తోంది. ప్రస్తుతం ప్లాన్లకు అదనంగా 2 జీబీ, 5 జీబీ డేటాను పొందేందుకు అవకాశం ఇస్తోంది.

వొడాఫోన్‌ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుండగా.. ఇందుకోసం వొడాఫోన్‌ యాప్, వెబ్‌సైట్ ద్వారా మాత్రమే రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా రూ.149, రూ.249, రూ.399, రూ.599 ప్లాన్లు వేయించుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది.

ఈ ఆఫర్ ప్రకారం రూ.149తో రీఛార్జ్‌ చేసుకుంటే 1 జీబీ డేటా వస్తుండగా, అదనంగా మరో 1 జీబీ డేటాను పొందవచ్చు. అలాగే రూ.219తో రిచార్జ్ చేయించుకుంటే ప్రస్తుతమున్న ప్లాన్‌కు అదనంగా 2 జీబీ డేటా రానుంది. ఇక రూ.249, రూ.399, రూ.599 రీఛార్జ్‌లకు రూ.5జీబీ డేటా పొందొచ్చు.

వొడాఫోన్ వినియోగదారులకు ఈ ప్లాన్లతో పాటు వోడాఫోన్ ప్లే, జీ5 స్ట్రీమింగ్ యాప్స్ కూడా చూసే అవకాశం ఉంది.



Next Story

Most Viewed