- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మలయాళీ మూవీ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ రైట్స్ను రామ్ చరణ్ తేజ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో జెనీలియా ముఖ్య పాత్ర పోషించబోతోందని టాక్ రాగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. మలయాళీ లూసీఫర్ మూవీలో విలన్గా నటించిన వివేక్ ఒబెరాయ్నే తెలుగులోనూ నటించాలని కోరారట దర్శక, నిర్మాతలు. కానీ చేసిన క్యారెక్టర్నే మళ్లీ చేయలేనని.. సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో నటుడు రహమాన్ను మెగాస్టార్ సినిమాలో విలన్గా ఫైనల్ చేసినట్లు సమాచారం.
Next Story