- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: లాక్డౌన్ సడలింపులతో 78రోజుల తర్వాత తెరచుకున్న యాదాద్రి లక్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే ఉచిత లఘు దర్శనం కల్పిస్తున్నారు. మొదటి రోజు కేవలం ఉద్యోగులు,సిబ్బంది మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు. కలెక్టర్ అనితా రామచంద్రన్ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదేళ్ల లోపు పిల్లలు, 60ఏళ్లు పైబడిన వారిని ఆలయంలోకి అనుమతించడం లేదు. అనారోగ్యంతో వచ్చిన వారికి వైద్యం అందించేందుకు కొండపై క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కౌంటర్లలో అందజేస్తున్నారు.
Next Story