‘ఓ మై కడవులే’ రీమేక్‌తో వస్తున్న విశ్వక్ సేన్

by  |
‘ఓ మై కడవులే’ రీమేక్‌తో వస్తున్న విశ్వక్ సేన్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త చిత్రాన్ని లాంచ్ చేశాడు. తమిళ్ ఫిల్మ్ ‘ఓ మై కడవులే’ రీమేక్ చేస్తున్న విశ్వక్.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి తెలుగులోనూ ఒరిజినల్ మూవీ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తుండగా.. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. కాగా హీరో విశ్వక్‌పై దిల్ రాజు క్లాప్ ఇవ్వగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్.. డైరెక్టర్‌కు స్క్రిప్ట్ అందించి విష్ చేశారు.

తమిళ్‌లో అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా నటించిన సినిమాను విజయ్ సేతుపతి నెరేట్ చేయగా లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. ప్రేమికుల రోజు( ఫిబ్రవరి 14, 2020)న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Next Story

Most Viewed