శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షలు: జగన్

by  |
ys jagan
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ పారిశ్రామిక వాడ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి పరిశ్రమ, ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి. కంపెనీ యజమాన్యం తరఫున 35 లక్షల రూపాయలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో 15 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మల్లేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed