తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు

by  |
తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 13వ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. T-20 సిరీస్‌లల్లో 270 ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ ఇప్పటికే 8990 పరుగులు సాధించాడు. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్‌తో 271 ఇన్నింగ్స్‌తో 9 వేల పరుగుల మైలు రాయిని ఛేదించిన తొలి ఇండియన్ క్రికెటర్‌, కెప్టెన్‌గా రికార్డు బ్రేక్ చేశాడు. ఇదే మ్యాచ్‌తో కోహ్లీ అత్యధికంగా T-20 సిరీస్‌లకు కెప్టెన్సీ వహించిన ఆటగాడిగా కూడా ఏకంగా వరల్డ్ రికార్డును సైతం బ్రేక్ చేశాడు.



Next Story