మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ప్రభుత్వ విప్..

by  |
మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ప్రభుత్వ విప్..
X

దిశ, కామారెడ్డి : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మానవత్వాన్ని చాటారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ఆదివారం పలు అబివృద్ది పనుల కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా పట్టణంలోని సుభాష్ టాకీస్ ప్రాంగణంలో అటో బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి.

అటువైపుగా వెళ్తున్న ప్రభుత్వ విప్ తన కాన్వాయిని పక్కన నిలిపి ప్రమాదవశాత్తు కింద పడ్డ వ్యక్తిని చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయాలు కావడంతో ఆటోను పిలిపించి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అంతటితో ఆగకుండా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటనలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించిన తీరును అందరూ ప్రశంసించారు.

Next Story

Most Viewed