ఓ వైపు పోలింగ్.. TRS నేతల ప్రలోభాలు.. నిలదీసిన గ్రామస్తులు (వీడియో)

by  |
ఓ వైపు పోలింగ్.. TRS నేతల ప్రలోభాలు.. నిలదీసిన గ్రామస్తులు (వీడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట‌ మండలంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. శ్రీరాములపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం ముగిసినా అక్కడి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. TRS ఇంచార్జ్, గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఓటర్లతో మాట్లాడుతూ వారిని ప్రలోభాలకు గురి చేశారు.

అది గమనించిన కొందరు గ్రామస్తులు అతడిని నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల వేళ స్థానికేతరులు ఇంకా నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. ఇక, ఇల్లందకుంటలో పోలింగ్ బూత్‌కి కూతవేటు దూరంలో టీఆర్ఎస్ పింక్ కండువాలతో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed