‘షేర్షా’కు కెప్టెన్ ఫ్యామిలీ కన్నీటి నివాళ్లు..

by  |
shersha
X

దిశ, సినిమా : కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షేర్షా’. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై పాజిటివ్ టాక్ అందుకుంది. సిద్ధార్థ్ కెరియర్‌లోనే ది బెస్ట్ మూవీగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్.. ఢిల్లీలో విక్రమ్ బత్రా ఫ్యామిలీ కోసం స్పెషల్ షో వేశామని, వారితో కలిసి సినిమా చూడటం గర్వంగా అనిపించిందని తెలిపాడు.

సినిమా చూస్తూ ఫ్యామిలీ మొత్తం కన్నీరు పెట్టుకుందని.. ఆ తర్వాత విక్రమ్ బత్రా ట్విన్ బ్రదర్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ మరిచిపోలేనని అన్నాడు. ‘విక్రమ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడూ చూడలేదని, వార్‌లో ఉన్న విక్రమ్ గురించి తలచుకుంటే ఇకపై నీ రూపమే ప్రత్యక్షమవుతుంది’ అని తనతో చెప్పారని వెల్లడించాడు సిద్ధార్థ్. ఆ కుటుంబంతో స్పెండ్ చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నానన్న ఆయన.. వారిని కన్నీటితో చూడటం బాధాకరమే అయినా ఒక నటుడిగా వారిలో ఆ ఎమోషన్స్ కలిగించడం సక్సెస్‌గా భావిస్తున్నట్లు తెలిపాడు.

Next Story

Most Viewed