కాసేపట్లో అమిత్ షాతో రాములమ్మ భేటీ

by  |
కాసేపట్లో అమిత్ షాతో రాములమ్మ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కాంగ్రెస్ ప్రచార కర్త, మెదక్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి కాసేపట్లో భేటీ కానున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఆమె బీజేపీలో చేరితే భవిష్యత్ తన స్థానం ఎంటనే అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారనే విషయం ఇప్పటికే పలుమార్లు చర్చకు రాగా.. ఈ నెల 7వ తేదీ (సోమవారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా ఆమె కషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

Next Story

Most Viewed