- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : పలు భాషల్లో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా నటి విజయ నిర్మల గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా, నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేశారు. ఆమె కుమారుడు నరేష్ గతంలో కామెడీ హీరోగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.
కాగా ఇప్పుడు విజయ నిర్మల కుటుంబం నుండి మరో తరం ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది. విజయనిర్మల మనవడు, నరేష్ కొడుకు శరణ్ హీరోగా వస్తున్నాడు. మహేష్ బాబు, నరేష్ అండదండలతో యాక్టింగ్, ఫైటింగ్, హార్స్ రైడింగ్ వంటి అంశాల్లో శరణ్ ఇప్పటికే ట్రైనింగ్ తీసుకున్నాడని తెలిసింది. రామ్ చంద్ర వట్టికూటి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాతో శరణ్ హీరోగా పరిచయం కానున్నాడు. కాగా ఈ సినిమాకి శ్రీలత బి. వెంకట్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Next Story