సేతుపతి గ్రీన్ ఇండియా చాలెంజ్

by  |
సేతుపతి గ్రీన్ ఇండియా చాలెంజ్
X

గ్రీన్ ఇండియా చాలెంజ్.. ‘హరా హై తో భరా హై’ చాలెంజ్ చైన్ సాగుతూనే ఉంది. ఎంపీ సంతోష్ ప్రారంభించిన ఈ మహా కార్యంలో ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు, టెక్నీషియన్లు పాల్గొనగా.. తాజాగా మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి పాల్గొన్నారు.

‘ఉప్పెన’ సినిమాతో తెలుగులో ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న సేతుపతి.. ఈ చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సన ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటారు. చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటి నీరు పోసిన సేతుపతి.. అభిమానులను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేశారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ.. ఈ చైన్ కొనసాగించాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

ఈ మధ్య ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి ఈ చాలెంజ్‌కు నామినేట్ చేయగా మొక్కలు నాటారు.

Next Story

Most Viewed