- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ‘మనం భారత్లోకి చొరబడి దాడి చేశాం. పుల్వామాలో విజయం మనందరిది. మీది. మాది. మన అందరిదీ. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానిది. మీరు, మేము కూడా ఆ విజయంలో భాగస్తులమే.’ ఈ వ్యాఖ్యలను చేసింది పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి. సాక్షాత్తూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఫిబ్రవరిలో జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన ఉగ్రవాద దాడి తమ విజయంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న విషయాన్ని బహిరంగంగా అంగీకరించినట్లియింది. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతోపాటు ఆ దేశ వ్యాప్తంగా పెద్ద దూమారం లేపాయి. పార్లమెంట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మాట మార్చారు. ‘పుల్వామా ఘటన తర్వాత మనం భారత్ భూభాగంలోకి చొరబడి దాడి చేశాం.’ అని చెప్పడం తన ఉద్దేశమని తెలిపారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని, అమాయకులను చంపబోమని చెప్పారు.