మా భూమి మాకు ఇవ్వండి.. వాటర్ ట్యాంక్ ఎక్కిన బాధితులు

by  |
మా భూమి మాకు ఇవ్వండి.. వాటర్ ట్యాంక్ ఎక్కిన బాధితులు
X

దిశ, ఖమ్మం రూరల్: తమ భూమి తమకు ఇవ్వాలంటూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి బాధితులు నిరసన తెలిపిన సంఘటన రూరల్ మండలంలో జరిగింది. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన మౌలానా భూములు ఇతరులు ఆక్రమించుకున్నారని అధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోవడంతో మౌలానా అల్లుడు యాకుబ్, ఇతర కుటుంబ సభ్యులు ట్యాంకు పైకి ఎక్కారు. తమకు న్యాయం జరిగేంతవరకు దిగేది లేదని బాధితులు ఆందోళన చేస్తున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్యాంక్ ఎక్కిన బాధితులను దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story