వైభవంగా వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు

by  |
వైభవంగా వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినా వేదికగా.. వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం హైదరాబాద్‌కు చెందిన రవితేజతో గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకను వీక్షించి.. వధూవరులను ఆశ్వీరదించడానికి రాజకీయ ప్రముఖులు సహా సినీ ప్రముఖులు సైతం తరలివచ్చారు.

ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, చిరంజీవితోపాటు పలువురు మంత్రులు, సినీ ప్రముఖలు హాజరయ్యారు.

Next Story

Most Viewed