నలుగురు వైఎస్ఆర్సీపీ ఎంపీలకి కీలక పదవులు

by  |
నలుగురు వైఎస్ఆర్సీపీ ఎంపీలకి కీలక పదవులు
X

దిశ ఏపీ బ్యూరో: నిన్నే రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలను అదృష్టం వరించింది. అలా ప్రమాణస్వీకారం చేశారో లేదో ఇలా ప్రమోషన్ కొట్టేశారు. పలువురు ఎంపీలను కీలక కమిటీలకు సభ్యులుగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. బొగ్గు, ఉక్కు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావును, పట్టణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అయోధ్య రామిరెడ్డిని, పరిశ్రమల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ని, ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పరిమల్ నత్వానిని నియమించారు. వెంకయ్యనాయుడు నిర్ణయం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.



Next Story