కేసీఆర్ మనసులో నుంచి పుట్టింది: వేముల

by  |
కేసీఆర్ మనసులో నుంచి పుట్టింది: వేముల
X

పల్లె ప్రగతి కార్యక్రమం కేసీఆర్ మనసులో నుంచి పుట్టిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంపై.. కలెక్టర్ అధ్యక్షతన పంచాయతీ రాజ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వేముల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల అభివృద్ధి సీఎం నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో రాజకీయ నాయకులకు గౌరవం పెరిగిందని వేముల అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా.. ఉచిత కరెంట్, కాళేశ్వరంతో నీళ్లు వచ్చాయన్నారు. పేదవారికి అండగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed