3634 వాహనాలు సీజ్..

by  |
3634 వాహనాలు సీజ్..
X

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు లాక్‌‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన 3634 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అంతేకాకుండా డబుల్, ట్రిపుల్ రైడింగ్, డాక్యుమెంట్లు లేని 5007 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు మోటారు వాహన చట్టం కింద మొత్తం 15315 కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

Tags: Hyderabad Traffic police, Vehicles seized, lockdown, violators, MV Act

Next Story

Most Viewed