పెళ్లి వాహనం బోల్తా.. 20 మందికి గాయాలు

by  |
పెళ్లి వాహనం బోల్తా.. 20 మందికి గాయాలు
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేసముద్రం మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పెళ్లి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed