మెగాఫోన్ పట్టిన వరలక్ష్మి శరత్ కుమార్

by  |
మెగాఫోన్ పట్టిన వరలక్ష్మి శరత్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన అయితే.. సౌత్‌ ఫైర్ బ్రాండ్‌గా వరలక్ష్మి శరత్ కుమార్‌ను చెప్పుకోవచ్చు. ఎవరికీ భయపడదు, ఏదీ దాచుకోదు.. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పే వరలక్ష్మి.. ఏడు నెలల గ్యాప్ తర్వాత ‘అద్దం’ అనే వెబ్‌సిరీస్‌‌లో నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్‌లోని ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తన సినీ కెరీర్‌లో హీరోయిన్‌గానే కాకుండా.. ప్రతినాయిక పాత్రల్లోనూ నటించి మెప్పించింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా వరలక్ష్మి మెగా ఫోన్ పట్టబోతుండటం విశేషం.

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా పేరు ‘కన్నామూచి’(దాగుడుమూతలు). దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. స్త్రీ సాధికారతను తెలియజేసేలా ‘ఇక్కడ చాలా ధైర్యవంతురాలైన మహిళ ఉంది. మనకు వారు తెలుసు, మనలోనే వారుండొచ్చు అలాంటి వారి గురించి బలంగా చెబుతాం’ అంటూ ఈ పోస్టర్‌ను తెలుగు, తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్.. తమ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఇక వరలక్ష్మీ డైరెక్టర్‌గా మారుతున్న సందర్భంగా.. అందరూ తనకు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మిని చూస్తే గర్వంగా ఉందని కీర్తి సురేష్, తాప్సీ, ఐశ్వర్య రాజేశ్‌లు అన్నారు. ఈ సినిమాను తెన్నాండాల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రామ‌స్వామి నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, ఈ క్రిష్ణమూర్తి సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇక వరలక్ష్మి తెలుగులో నటించిన ‘క్రాక్’ సినిమాతో పాటు తమిళంలో ‘వెల్వెట్ నగరం’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


Next Story

Most Viewed