ICUలో చేరిన వనజీవి..

by  |
ICUలో చేరిన వనజీవి..
X

దిశ, వెబ్‌డెస్క్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను తొలుత ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు రామయ్యను గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం రామయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తుండగా.. గతంలో ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగినట్లు సమాచారం. ఇదిలాఉండగా, కోటి మొక్కలు నాటి పర్యావరణ హితానికి పాటుపడుతున్నందున కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2017లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.



Next Story

Most Viewed