అదుపు తప్పి వ్యాన్ బోల్తా.. 9మంది మృతి

by  |
అదుపు తప్పి వ్యాన్ బోల్తా.. 9మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరాపూట్ జిల్లా సిందిగాం దగ్గర ఆదివారం అర్ధరాత్రి వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 22 మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed