మోడీని ‘వాలిమై’ అప్‌డేట్ అడిగిన అజిత్ ఫ్యాన్స్

by  |
మోడీని ‘వాలిమై’ అప్‌డేట్ అడిగిన అజిత్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా : తలా.. అజిత్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెరపై తన ఏజ్‌కు తగ్గ లుక్‌లో కనిపించేందుకు ఏ మాత్రం సిగ్గుపడని అజిత్ అంటే తమిళనాట సూపర్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా బోనీ కపూర్ నిర్మించిన ‘నెర్కొండ పార్వాయి’ సినిమా తర్వాత తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగిందనే చెప్పొచ్చు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. ఫొటోగ్రఫీని నిరవ్ షా అందించారు. కాగా మళ్లీ ఇదే కాంబినేషన్‌లో అజిత్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘వాలిమై’ వస్తుండటం విశేషం. కాగా ఈ మూవీ అప్‌డేట్ గురించి తమిళనాడులో మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న అజిత్ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై చెపాక్ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ ప్లేయర్ మొయిన్ అలీ.. ఈ సినిమా అప్‌డేట్ గురించి వాకబ్ చేయడమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో వైరల్ అయిన రెండు రోజులకే నెట్టింట్లో మరో వీడియో హల్‌చల్ చేస్తోంది.

https://twitter.com/ThalaAjith_FC/status/1361132952478908417?s=20

ఫిబ్రవరి 14న చెన్నైలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా అజిత్ అభిమానులు ఏకంగా ఆయన్నే ‘వాలిమై’ అప్‌డేట్ గురించి అడిగారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే దారిలో వాలిమై అప్‌డేట్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ కాగా.. మేకర్స్ ఈ వీడియోలు చూసైనా సరే, అప్‌డేట్ త్వరగా ఇస్తే బాగుంటుంది అంటున్నారు నెటిజన్లు.



Next Story

Most Viewed