ఈ పాపకు ఎంత ధైర్యం.. చీఫ్ జస్టిస్ కే లేఖ రాసింది..

by  |
ఈ పాపకు ఎంత ధైర్యం.. చీఫ్ జస్టిస్ కే లేఖ రాసింది..
X

దిశ, యచారం : మంచాల మండల కేంద్రంలోని చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి చిన్నారి వైష్ణవి లేఖ రాసింది. చిన్నారి రాసిన లేఖకు జస్టిస్ రమణ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి బస్సు సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బస్సు సౌకర్యం కల్పించారు. పాఠశాల సమయంలో ఉదయం 7 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు చీదేడు కు బస్సు సేవలు పునర్ ప్రారంభించారు.


Next Story

Most Viewed