టీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయాలి: ఉత్తమ్

by  |
టీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయాలి: ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిందేమీ లేదని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ విమర్శించారు. ట్యాంక్‌బండ్​లో కొబ్బరినీళ్లు ఎక్కడ కనిపిస్తున్నాయని, ఏడేళ్ల నుంచి చెప్పిందే చెప్పుకుంటూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టో తయారు చేశారని మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్​ మేనిఫోస్టో విడుదల సందర్భంగా గాంధీభవన్​లో ఉత్తమ్​‌కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు మాటలతో మభ్యపెడుతున్నారే తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోనే మళ్లీ రిలీజ్‌ చేశారని, టీఆర్‌ఎస్‌ పార్టీని, మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయాలని గ్రేటర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పక్కన ఏపీ రాష్ట్రం కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంటే తెలంగాణలో ఎందుకు చేర్చడం లేదని విమర్శించారు.



Next Story

Most Viewed