- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్కు టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శించారు. ట్యాంక్బండ్లో కొబ్బరినీళ్లు ఎక్కడ కనిపిస్తున్నాయని, ఏడేళ్ల నుంచి చెప్పిందే చెప్పుకుంటూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టో తయారు చేశారని మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్ మేనిఫోస్టో విడుదల సందర్భంగా గాంధీభవన్లో ఉత్తమ్కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు మాటలతో మభ్యపెడుతున్నారే తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోనే మళ్లీ రిలీజ్ చేశారని, టీఆర్ఎస్ పార్టీని, మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయాలని గ్రేటర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పక్కన ఏపీ రాష్ట్రం కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంటే తెలంగాణలో ఎందుకు చేర్చడం లేదని విమర్శించారు.
Next Story