అధికారంలోకి వచ్చే విషయమై ఉత్తమ్ క్లారిటీ

by  |
అధికారంలోకి వచ్చే విషయమై ఉత్తమ్ క్లారిటీ
X

దిశ, న్యూస్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మోస్ట్ పాపులర్ లీడర్ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్సార్ అని కొనియాడారు. వైస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు భారత దేశ వ్యాప్తంగా పాలకులందరూ పాటిస్తున్నారన్నారు. వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రైతులకు, యువతకు, విద్యార్థులకు, మహిళలకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ల్యాండ్ మార్క్ ను క్రియేట్ చేశారని ఉత్తమ్ కొనియాడారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.



Next Story